MLA Raja Singh: 'ఎమ్మెల్యేలను సచివాలయంలోకి రానివ్వరా...?'

By

Published : May 6, 2023, 2:34 PM IST

thumbnail

MLA Raja Singh on Secretariat : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కొత్త సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ క్రమంలో కొత్త సచివాలయం తెలంగాణ చరిత్రలోనే అద్భుతమని ఎమ్మెల్యేలు, మంత్రులు కొనియాడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం విరుచుకుపడుతున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వట్లేదని రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ మూడు సబెక్టులపై ఈ రోజు సచివాలయంలో సమావేశం పెట్టారని దానికి సంబంధించి అందరు రావాలని మెసేజ్​ చేశారని తెలిపారు. తాను కూడా సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. తమను ఆహ్వానించి అలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో కట్టుకున్న సచివాలయంలో ప్రజాప్రతినిధులను రాకుండా అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.