Kaleshwaram Chief Engineer on Medigadda Project : 'మేడిగడ్డ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు.. డిజైన్​లో లోపం లేదన్న ఇంజినీర్లు'

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 7:25 PM IST

Updated : Oct 22, 2023, 9:09 PM IST

thumbnail

Kaleshwaram Chief Engineer on Medigadda Project : భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీ చీఫ్‌ ఇంజినీర్‌ నల్లా వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ బ్యారేజీ కుంగుబాటుపై నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Projec) వద్ద ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును 2019లో ఎల్​ అండ్​ టీ నిర్మించిందని గుర్తు చేశారు. డిజైన్​లో ఎలాంటి లోపం లేదని వివరించారు. ఈ బ్యారేజీ అడుగున్నర మేర కుంగుబాటు వచ్చిందని స్పష్టం చేశారు. 

Chief Engineer on Medigadda Project Issue : బ్యారేజీ కుంగుబాటు తర్వాత నీటిని దిగువకు విడుదల చేశామని ఇంజినీర్​ వెంకటేశ్వర్లు​ పేర్కొన్నారు. ప్రాజెక్ట్​ను నిపుణుల విశ్లేషించి.. పరిశీలిస్తున్నారని అన్నారు. బ్యారేజీకి త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు. గతంలో 29 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనిచేసిందని వివరించారు.   

Last Updated : Oct 22, 2023, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.