గంజాయి దొంగలు చెప్పిన సమాధానంతో హతాశులైన పోలీసులు

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 1:13 PM IST

thumbnail

Ganja Theft in Police Station: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో వింత చోరి చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిని గంజాయి ఎక్కడి నుంచి లభించిందని విచారించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. పోలీస్​ స్టేషన్​లో భద్రపరిచిన గంజాయినే దొంగతనం చేశామని చెప్పిన నిందితుల సమాధానంతో పోలీసులు అవాక్కైయ్యారు. దొంగలు చెప్పిన మాటలు ధృవీకరించుకోవడానికి తమ స్టేషన్​ను పరిశీలించిన వారికి .. జరిగింది వాస్తమని తేలడంతో పోలీసులు హతాశులయ్యారు. 

పోలీసుల వివరాల ప్రకారం పలు కేసుల్లో పట్టుబడిన గంజాయిని అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్​ పోలీస్‌స్టేషన్‌ స్ట్రాంగ్​ రూమ్​లో భద్రపరిచారు. అయితే రెండు రోజుల క్రితం సోమన్నపాలెం సమీపంలో గంజాయి రవాణా చేస్తూ 6గురు యువకులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, యలమంచిలి రూరల్​ పోలీస్​ స్టేషన్​లోని స్ట్రాంగ్​ రూంలో గంజాయిని దొంగిలించినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్టేషన్​లోని గంజాయిని తూకం వేయగా, పట్టుబడిన గంజాయి, తూకంలో తక్కువ వచ్చిన దానికి సరిపోలింది. పలు దఫాల్లో చోరి చేయగా, ఇప్పుడు తరలిస్తూ పట్టుబడినట్లు దొంగలు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సారి దర్యాప్తును పకడ్బందీగా జరుపుతున్నట్లు సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.