ప్రజలు బీఆర్​ఎస్​ను ఓడించాలనే కాంగ్రెస్​కు ఓటేశారు - అసలైన గెలుపు బీజేపీదే : లక్ష్మణ్​

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 8:07 PM IST

thumbnail

BJP Leader Laxman Press Meet : లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలకుపైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అగ్రనేత అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారని బీజేపీ సీనియర్​ నేత లక్ష్మణ్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అమిత్​ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. లోక్​సభ ఎన్నికలకు అమిత్​ షా శంఖారావం పూరించారన్న లక్ష్మణ్​ బీఆర్​ఎస్​ను ఓడించాలనే కాంగ్రెస్​కు ఓటేశారని కానీ అసలైన గెలుపు బీజేపీదేనని పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్​ మునిగిపోయే పడవ, వికసించే కమలం బీజేపీ అంటూ లక్ష్మణ్​ అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ను బీజేపీ ఓడించిందని గుర్తు చేశారు. ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రెండూ పెంచుకున్నామని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో ఈసారి గెలిచి సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇక బలంగా ముందుకు తీసుకుపోతామని కె.లక్ష్మణ్​ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.