ETV Bharat / state

డ్రైవర్ నిద్రమత్తు... అతివేగం... ప్రమాదానికి కారణం

author img

By

Published : May 21, 2019, 9:44 AM IST

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ముందువెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.

నుజ్జునుజ్జైన బస్సు ముందుభాగం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా... పదిమంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలుపుతున్నారు.

నుజ్జునుజ్జైన బస్సు ముందుభాగం
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.