ETV Bharat / state

విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: వినయ్​ భాస్కర్​

author img

By

Published : Feb 15, 2021, 8:54 PM IST

mlc elections, mla vinay bhaskar
ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​, ఎమ్మెల్సీ ఎన్నికలు

పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అన్నారు. హన్మకొండలో తెరాస శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. హన్మకొండలో పట్టభద్రులైన తెరాస శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికలపై చర్చించారు.

పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపునకు కార్యకర్తలందరూ కృషి చేయాలని వినయ్​ భాస్కర్ సూచించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.