సిద్దిపేట జిల్లా గౌరారం రాజీవ్ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి సిద్ధిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. గౌరారం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ రాజిరెడ్డిని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో కండక్టర్ శ్రీనివాస్ శర్మకతోపాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం డ్రైవర్ను హైదరాబాద్కు తరలించారు.