ETV Bharat / state

పీడీఎస్​ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Sep 24, 2020, 9:12 AM IST

మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న 130 బస్తాల పీడీఎస్​ బియ్యాన్ని స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

PDS RICE SEZED
పీడీఎస్​ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం మైసమ్మ కుంట తండా 130 బస్తాల పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం రవాణాపై ముందస్తు సమాచారంతో స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.