ETV Bharat / state

రాత్రి వర్షం.. రాకపోకలకు ఆటంకం..

author img

By

Published : Oct 20, 2019, 11:32 AM IST

Updated : Oct 20, 2019, 1:12 PM IST

రాత్రి కురిసిన భారీ వర్షం జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అతలాకుతలం చేసింది. వాగులు పొంగి పొర్లాయి. కాటారాం-మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 17 వందల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి.

రాత్రి వర్షం.. రాకపోకలకు ఆటంకం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం అర్దరాత్రి కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహాదేవపూర్, కాళేశ్వరం, కాటారం, మహాముత్తారం, పలిమేల మండలాల్లో భారీ వర్షం కురిసింది. కేశవాపూర్ పెద్దవాగు, ధౌత్​పల్లి మహాముత్తారం వాగులు ఉప్పొంగాయి. లోలెవెల్ వంతెన పైనుంచి నీరు ప్రవహించింది. కేశవాపూర్ పెద్దవాగు వంతెన పైనుంచి భారీగా ప్రవాహం వెళుతుండటం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు, ఈదురు గాలులకు సుమారు 17 వందల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. ఇప్పటికీ రాకపోకలు సరిగ్గా జరగక, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులు వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్తున్నారు.

రాత్రి వర్షం.. రాకపోకలకు ఆటంకం..

ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు

sample description
Last Updated : Oct 20, 2019, 1:12 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.