ETV Bharat / state

'చేతిలో హైకోర్టు ఆర్డర్​ ఉన్నా.. పాదయాత్రకు అనుమతివ్వడం లేదు'

author img

By

Published : Dec 4, 2022, 4:11 PM IST

Updated : Dec 4, 2022, 7:30 PM IST

YS Sharmila comments on CM KCR: 8ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ తప్పులను ఏ ఒక్కరు ఎత్తిచూపలేదని.. కవిత ఒక మహిళ అయ్యి ఉండి లిక్కర్​ స్కాంలో ఉండడం ఏంటని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి హామీలను అమలు చేయకపోవడంపై తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్​కు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

YS Sharmila comments on CM KCR
వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల

YS Sharmila comments on CM KCR: పాదయాత్రకు సంబంధించి తమ చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉన్నా.. పోలీసులు అనుమతి ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారని వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల మండిపడ్డారు. పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి.. ఓర్వలేకే ఆపాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. లోటస్ పాండ్ లోని వైఎస్సార్​టీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్​ షర్మిల మాట్లాడారు. టీఆర్​ఎస్​ అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపితే తట్టుకోలేకే.. దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ దిగలేదని షర్మిల తెగేసి చెప్పారు. ఒక మహిళను పట్టుకొని మరదలు, వ్రతాలు అనడం వ్యక్తిగత దూషణ కాదా.. ఇప్పుడు టీఆర్​ఎస్​ నాయకులు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు.

"మా పాదయాత్రే కేసీఆర్​ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్​కు స్పష్టంగా అర్థమైంది. అందుకే నా పాదయాత్రను ఎలాగైన ఆపాలని కంకణం కట్టుకున్నారు కేసీఆర్​. పోలీసుల భుజాన తుపాకి పెట్టి మా పాదయాత్రను ఆపివేయాలని చూస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు చెప్పుతున్నా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ మాకు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు." -వైఎస్​ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

వైఎస్​ షర్మిల మీడియా సమావేశం

టీఆర్​ఎస్​ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 8ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్​ఎస్ తప్పులను ఏ ఒక్కరు ఎత్తిచూపలేదని, ఇప్పుడు తాను ఎత్తుచూపుతున్నానన్నారు. కవిత ఒక మహిళ అయి ఉండి లిక్కర్​ స్కాంలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆరోపణలు చేసిన టీఆర్​ఎస్​ నాయకులపై పబ్లిక్ ఫోరమ్ ఏర్పాటుచేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండని వైఎస్​ షర్మిల సవాల్​ విసిరారు. నిజానికి షోకాజ్​ నోటీసులు సీఎం కేసీఆర్​కే ఇవ్వాలన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నోటీసులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్​, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులు హైకోర్టు ఆర్డర్​ను ఉల్లంఘిస్తున్నారని దీనిపై అప్పీల్​కు వెళతామని వైఎస్​ షర్మిల తెలిపారు. పోలీసులు తెలంగాణ పోలీసులుగా కాకుండా టీఆర్​ఎస్​ పోలీసులుగా మారిపోయారన్నారు. బండి సంజయ్​ పాదయాత్ర బాగానే సాగుతోంది కదా.. మరి తన పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.