ETV Bharat / state

నేడు సీఎం రేవంత్​ రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ - ఉచిత ప్రయాణం మార్గదర్శకాలపై చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 10:44 AM IST

TSRTC Free Ride for Women Guidelines : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 9న సోనియా పుట్టిన రోజు పురస్కరించుకొని మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సమావేశం కానున్నారు. అనంతరం మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Mahalakshmi Scheme Guidelines Today
TSRTC Free Transport for Women Guidelines

TSRTC Free Ride for Women Guidelines : సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా తొలుత రెండింటిని అమలు చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించటంతో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తమిళనాడులో కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో బస్సుల్ని అందుబాటులోకి తెచ్చారు.

హామీల అమలుపై కొత్త సర్కార్​​ ఫోకస్​ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

Mahalakshmi Scheme Guidelines Today : కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకోసం మహిళలంతా స్మార్ట్‌కార్డ్‌ల కోసం అప్లై చేసుకోవాలని సూచించింది. అవి వచ్చే వరకు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డుతో ప్రయాణానికి అనుమతిచ్చింది. అయితే కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే రాష్ట్రంలో మహిళా జనాభా తక్కువగా ఉందన్న అధికారులు, ఆ పథకం అమలుతో ఆర్థికంగా కొంత తక్కువ భారమే పడుంతుందని భావిస్తున్నారు. ఆ పథకం అమలు తీరును ఆర్టీసీ అధికారులు కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేస్తున్నారు.

Free RTC Bus Ride in Telangana : మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలంటే ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారనేది లెక్క తేలాల్సి ఉంటుంది. అందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. జీరో టికెట్ విధానంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో లెక్కించే వెసులుబాటు ఉంటుంది. కర్ణాటక తరహా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే రూ.700 కోట్లు వ్యయం కానున్నట్లు భావిస్తున్నారు.

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు - సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలు చేస్తే ప్రతి నెలా సుమారు రూ.180 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కర్ణాటక విధానాన్నే అమలు చేస్తారా? లేక మరో విధాన్ని అనుసరిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు నేడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశానికి అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందింది. ముఖ్యమంత్రితో భేటీలో వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశం తర్వాత మార్గదర్శకాలతో కూడిన పూర్తి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బస్సులు సరిపోతాయా? కర్ణాటకలో జూన్‌ నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 22 వేల పైచిలుకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఆ సంఖ్య కేవలం 8,571 గా ఉంది. కర్ణాటకలో ఈ పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40-41 శాతంగా ఉండగా, అమలు తర్వాత 52-55 శాతానికి పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ఆయన చెప్పిన ప్రకారం మన రాష్ట్రంలో బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆ వయసు వారికే!

ఏయే బస్సుల్లో అనేది ప్రభుత్వ నిర్ణయమే: మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలు చేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలో మీటర్ల మేర బస్సులను నడుపుతోందని, సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.4 కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

జీవన్​రెడ్డి మాల్​కు ఆర్టీసీ నోటీసులు - బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.