గత ఆరేళ్లలో హైదరాబాద్.. దేశంలో ప్రధాన టెక్ హబ్గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జీ సిటీలో నైట్ ఫ్రాంక్ ఇండియా కొత్త కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్తో కలిసి.. నగరాభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాలు, స్థిరాస్తిని విశ్లేషిస్తూ నైట్ ఫ్రాంక్ తయారు చేసిన వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ రిపోర్టును విడుదల చేశారు.
తక్కువ సమయంలో ప్రముఖ బహుళ జాతి సంస్థలను తెలంగాణ ఆకర్షించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సుస్థిర సాంకేతికతలను తయారు చేసేందుకు భవిష్యత్తులో కూడా ఇదే తీరులో పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో 4.16 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ నేడు 6.63 లక్షల కోట్లకు చేరిందన్నారు. 8.08 శాతంతో దేశ సగటు ఆర్థిక వృద్ధి కంటే ఎక్కువ సాధించామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి: '2030 వరకు లైఫ్ సైన్సెస్లో తెలంగాణ ఆసియాలోనే నెంబర్వన్ కావాలి'