ETV Bharat / state

చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ

author img

By

Published : Oct 29, 2020, 2:32 PM IST

Updated : Oct 29, 2020, 3:07 PM IST

కమిటీ ప్రతిపాదనల అమలుకు తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ
కమిటీ ప్రతిపాదనల అమలుకు తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ

14:29 October 29

చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల దురాక్రమణపై విచారించేందుకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిరాకరించింది. భాగ్యనగరంలో చెరువులు, నాలాల ఆక్రమణ జరిగిందని.. ఇటీవలి వరదలకు ఇదే ప్రధాన కారణమంటూ... జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లాస్కర్​ కమిటీ ప్రతిపాదనలు అమలుకావట్లేదని పిటిషనర్​ ఎన్జీటీకి తెలిపారు.  

అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తాము ప్రభుత్వానికి చెప్పలేమని ఎన్జీటీ తెలిపింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఎన్జీటీ సూచన మేరకు సిల్వేరి శ్రీశైలం పిటిషన్​ను ఉపసంహరించుకున్నారు.  

ఇదీ చదవండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్​

Last Updated :Oct 29, 2020, 3:07 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.