ETV Bharat / state

బయో ఆసియా సదస్సులో భారత్​ బయోటెక్​ సీఎండీ, జేఎండీలకు ఎక్స్​లెన్స్ అవార్డ్

author img

By

Published : Feb 22, 2021, 12:04 PM IST

భారత్​ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లను జినోమ్ వ్యాలీ ఆఫ్​ ఎక్స్​లెన్స్ అవార్డు వరించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయో ఆసియా సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.

Genome Valley of Excellence Award for Bharat Biotech CMD and JMD
భారత్​ బయోటెక్​ సీఎండీ, జేఎండీలకు జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డ్

హైదరాబాద్​ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఈ సదస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కరోనా దృష్ట్యా దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నారు.

కార్యక్రమంలో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డులు అందజేశారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి పురస్కారాలు అందించేందుకు ప్రతి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సెన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత్​ బయోటెక్​ సీఎండీ, జేఎండీలకు జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.