ETV Bharat / state

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 3:55 PM IST

Updated : Aug 25, 2023, 7:37 PM IST

Congress MLA Tickets Applications 2023 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ఆశావహులు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఇప్పటికే 1017 మందికి పైగా టికెట్ల కోసం దరఖాస్తు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు భట్టి, ఉత్తమ్‌, జగ్గారెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు సహా పలువురు నేతలు దరఖాస్తులు అందజేశారు. జానారెడ్డి స్వయంగా పోటీలో లేనప్పటికీ.. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.

Huge Applications for Congress Tickets at Gandhi Bhavan
Huge Applications for Congress Tickets

Congress MLA Tickets Applications 2023 : ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్‌ ఆశావహుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు సమర్పించే గడువు ముగియగా.. సాయంత్రం వరకు 1017కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని ప్రముఖ నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ సహా ఇతరులు పోటీకోసం దరఖాస్తులు చేయగా.. చివరి రోజు కూడా పెద్ద సంఖ్యలో తమ పేర్లను ప్రతిపాదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ టికెట్ కోసం ఏకంగా 36 మంది పోటీపడుతున్నారు.

MP Komatireddy Counter to KCR : '50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?'

Telangana Assembly Elections 2023 : మధిర అసెంబ్లీ స్థానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తరపున గాంధీభవన్ ఇంఛార్జ్‌ కుమార్‌రావు దరఖాస్తు చేశారు. ములుగు టికెట్ కోసం సీతక్క.. పినపాక టికెట్ కోసం సీతక్క కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్‌రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చెయ్యగా.. మిర్యాలగూడ టికెట్(Miryalaguda Ticket) కోసం పెద్దకుమారుడు రఘువీర్‌రెడ్డి మరో దరఖాస్తు చేశారు. జానారెడ్డి ఈసారి దరఖాస్తు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దామోదర రాజనర్సింహ పోటీకి తన పేరును ప్రతిపాదించారు. ముషీరాబాద్ టికెట్‌ కోసం అంజన్‌కుమార్‌ యాదవ్, కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ దరఖాస్తు చేశారు. ఎల్బీనగర్‌ నుంచి మధుయాష్కీగౌడ్‌, మంథని నుంచి శ్రీధర్‌బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి దరఖాస్తు చేశారు. హుజూరాబాద్‌ నుంచి బల్మూరి వెంకట్‌ తనపేరును ప్రతిపాదించారు. కోదాడ, హుజూరాబాద్‌ నుంచి సినీ నిర్మాత అప్పిరెడ్డి దరఖాస్తు చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అర్జీలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌కి అందజేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ అవకాశం ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Telangana Congress MLA Candidates List : సెప్టెంబర్​లో మొదటివారంలో.. కాంగ్రెస్​ అభ్యర్థుల తొలి జాబితా

Telangana Assembly Elections Congress Members : కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్​కు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేశారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ సర్వే దూరంగా ఉంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి కేసీఆర్​ అన్న రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్‌రావు దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ దరఖాస్తు వేశారు. షాద్‌నగర్ టికెట్‌ కోసం ఈర్లపల్లి శంకర్ దరఖాస్తు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ 12 సీట్లకు 12 క్లీన్​స్వీప్​ చేస్తుందని ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే కాంగ్రెస్​ ప్రకటించనుంది.

Revanth Reddy will contest in Kodangal : ' వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే పోటీచేస్తా'

Last Updated : Aug 25, 2023, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.