ETV Bharat / state

పట్టభద్రుల ఓటర్ల జాబితాకు కొత్త షెడ్యూల్

author img

By

Published : Dec 1, 2020, 9:08 PM IST

పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితా తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం ఓటర్ల జాబితా తయారీకి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.

పట్టభద్రుల ఓటర్ల జాబితాకు కొత్త షెడ్యూల్
పట్టభద్రుల ఓటర్ల జాబితాకు కొత్త షెడ్యూల్

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ను సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ముసాయిదాను ఈనెల 8న ప్రకటిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులను 2021 జనవరి 8 వరకు స్వీకరిస్తారు. వాటిని జనవరి 18 నాటికి పరిష్కరించాల్సి ఉంటుంది. ఓటర్ల తుది జాబితాను 2021 జనవరి 22న ప్రచురిస్తారని ఈసీ తెలిపింది.

ఇదీ చూడండి: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.