ETV Bharat / state

Case Filed Against YS Sharmila : బంజారాహిల్స్‌లో వైఎస్​ షర్మిలపై కేసు నమోదు

author img

By

Published : May 18, 2023, 4:43 PM IST

Case Filed Against YS Sharmila : వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో పాటు సోషల్‌ మీడియాలో సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్​ను ఆమె దూషించారంటూ ఆ పార్టీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Case Filed Against YS Sharmila
Case Filed Against YS Sharmila

Case Filed Against YS Sharmila : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రెస్‌ మీట్​, సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ ఈ నెల 16వ తేదీన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Case Against Sharmila in Banjarahills Police station : బీఆర్ఎస్‌ పార్టీని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ప్రస్తావించడంతో పాటు కేసీఆర్ పేరుపై అఫిడవిట్‌ తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్​ యాదవ్​ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలో వైఎస్ షర్మిల ఎస్​ఐ, మహిళా కానిస్టేబుల్​పై చేయి చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై సెక్షన్​ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా రెడ్​విత్ 34, 337, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో అరెస్టయిన షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్​ విధించింది. ఈ కేసులో షర్మిలకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్​ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్​గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కౌంటర్​ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులు ఇవ్వకుండానే ఆమెను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటకు వెళ్లనివ్వట్లేదని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని కోర్టులో వాదించారు. షర్మిలను ఎస్ఐ తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు ఆమె చేయి విరిచే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు కొట్టారు.. ఆ క్రమంలోనే షర్మిల పోలీసులు తోసేశారని అన్నారు.

పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు. పోలీసులపై చేయి చేసుకుంటే తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. వేగంగా కారు పోనివ్వాలని షర్మిల డ్రైవర్‌కు సూచించారని వివరించారు. దీంతో ఆమె కారు తగిలి అక్కడున్న కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టులో వాదించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.