ETV Bharat / sports

'అందుకే రియో ఒలింపిక్స్​లో పతకం సాధించగలిగా'

author img

By

Published : Nov 3, 2020, 7:45 PM IST

శిక్షణా శిబిరంలో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్​ చేయడం వల్లే 2016 రియో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించానని తెలిపింది భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​.

Sakshi Malik
భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​.

భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​.. 2016 రియో ఒలింపిక్స్​లో కాంస్య పతకాన్ని సాధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ఆ ఒలింపిక్స్​​లో పాల్గొనే ముందు మూడు నెలల పాటు శిక్షణ శిబిరంలో చేసిన ప్రాక్టీస్​ వల్లే ఆ విజయం వరించిందని తెలిపింది.

"రియో ఒలింపిక్స్​లో పాల్గొనే ముందు విదేశాల్లోని శిక్షణ శిబిరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన సహ క్రీడాకారులతో కలిసి బాగా ప్రాక్టీస్​ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్​ పతకాలు సాధించిన వాళ్లతో కలిసి నేను శిక్షణ చేశాను. ఆ సమయంలో ఆటకు సంబంధించి ఎన్నో మెలకువలను నేర్చుకున్నాను. దీంతో ఎంతో అనుభవం వచ్చింది. పోరులో దిగినప్పుడు కూడా చివరివరకు దూకుడుగా ఆడాను. అందుకే నేను కాంస్య పతకాన్ని సాధించగలిగాను. ఆ మూడు నెలల శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది."

-సాక్షి మాలిక్​, స్టార్​ రెజ్లర్​.

సాక్షి అర్హత సాధించిన తీరు

మొదట రెజ్లింగ్‌ మహిళల పోటీ ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ స్వీడన్‌కు చెందిన జొహన్నాపై 5-4 తేడాతో గెలుపొంది ప్రి క్వార్టర్స్‌ కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్​లో మల్డోవాకు చెందిన మారియానాపై గెలుపొంది క్వార్టర్​‌ ఫైనల్స్​కు చేరుకుంది. క్వార్టర్స్​లో రష్యాకు చెందిన వలేరియా కబ్లోవాతో తలపడి ఓడిపోయింది. అనంతరం వలెరియా కబ్లోవా ఫైనల్​కు చేరుకోవడం వల్ల సాక్షికి రెపి‌చేజ్​లో పోటీపడే అవకాశం లభించింది. ఇందులో సాక్షి.. మంగోలియాకు చెందిన ఒర్ఖాన్ పై 12-3 తేడాతో గెలుపొందింది. దీంతో కాంస్య పోరుకు అర్హత సాధించింది. ఈ పోరులో కిర్గిస్థాన్​కు చెందిన టైనైబెకోవాపై 8-5తేడాతో గెలుపొంది రియో ఒలింపిక్​లో భారత్​కు తొలి పతకం తీసుకొచ్చిన క్రీడాకారిణిగా నిలిచింది.

Sakshi Malik
భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​.
Sakshi Malik
భారత స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​.

ఇదీ చూడండి మహిళా టీ20 ఛాలెంజ్​ షెడ్యూల్​పై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.