ETV Bharat / sports

హిట్​మ్యాన్​​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. రోహిత్​కు క్వారంటైన్​ పూర్తి.. టీ20 సిరీస్​కు రెడీ

author img

By

Published : Jul 3, 2022, 7:34 PM IST

Rohit sharma news: టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ త్వరలో జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. కరోనా నుంచి కోలుకున్నరోహిత్​ ఆదివారంతో క్వారంటైన్​ పూర్తిచేసుకున్నాడు.

రోహిత్
రోహిత్

Rohit sharma news: ఇటీవల కరోనా బారిన పడిన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ వైరస్​ నుంచి కోలుకున్నాడు. ఇప్పటికే పరీక్షల్లో నెగటివ్​ రాగా ఆదివారంతో రోహిత్​కు క్వారంటైన్​ పూర్తయింది. ఈ నేపథ్యంలో రోహిత్​ ఈనెల 7 నుంచి జరిగే టీ20 సిరీస్​కు అందుబాటులో ఉంటాడు. ఈ విషయాన్ని బీసీసీఐ నిర్ధరించింది. రోహిత్​ పూర్తిగా కోలుకున్నాడని అయితే టీ20 సిరీస్​ ముందు జరిగే వార్మప్​ మ్యాచ్​లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్‌ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది.

అయితే, టీ20 సిరీస్‌కు ప్రత్యేకంగా రెండు బృందాలను ఎంపిక చేయడం గమనార్హం. ఇంగ్లాండ్​తో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టుకు, తొలి టీ20 మధ్య ఎక్కువ సమయం లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఐర్లాండ్​తో టీ20 సిరీస్​ ఆడిన జట్టే ఇంగ్లాండ్​తో తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఇక రెండో టీ20 నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్​ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారు. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్​దీప్​ సింగ్.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.

ఇదీ చూడండి : నయా 'వీరు'డు పంత్​ రికార్డుల మోత.. దిగ్గజాలను సైతం వెనక్కినెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.