ETV Bharat / sitara

'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి'

author img

By

Published : Nov 14, 2020, 10:13 PM IST

Updated : Nov 19, 2020, 2:21 PM IST

దీపావళి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు సుమన్​. దీంతోపాటే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.

actor suman
సుమన్

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఆవు మన జాతీయ సంపద అని ఆయన పేర్కొన్నారు. గో హత్యలను ఆపాలని....ప్రతి ఒక్కరు గో సంరక్షణ చేయాలని సూచించారు. యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివకుమార్‌ గో సంరక్షణ కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

శివకుమార్ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు తోడుగా నిలవాలన్నారు. ఆవు వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని హిందువులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతోపాటే దీపావళిని అందరు ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సుమన్

ఇదీ చూడండి : దీపాల వెలుగుల్లో సినీతారల సందడి

Last Updated :Nov 19, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.