ETV Bharat / jagte-raho

చెరువు వద్ద యువకుడితో సర్పంచ్ భర్త వాగ్వాదం.. పరస్పర దాడి

author img

By

Published : Aug 21, 2020, 10:42 AM IST

Updated : Aug 21, 2020, 5:19 PM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ చెరువు వద్ద గ్రామ సర్పంచ్ భర్త విక్రమ్, గ్రామస్థుడు మహేశ్ పరస్పరం ఘర్షణ పడ్డారు. అనంతరం పంచాయితీ పోలీస్ స్టేషన్​కు వెళ్లగా... ఇరువురు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

చెరువు వద్ద యువకుడితో సర్పంచ్ భర్త వాగ్వాదం.. పరస్పర దాడి
చెరువు వద్ద యువకుడితో సర్పంచ్ భర్త వాగ్వాదం.. పరస్పర దాడి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ సర్పంచ్ భర్త విక్రమ్​పై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండటం వల్ల గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అక్కడి స్నేహితులతో వెళ్లాడు.

మాట మాట పెరిగి...

ఈ క్రమంలో చెరువు వద్దకు ఎవరు రావొద్దని మహేశ్​ను గ్రామ సర్పంచ్ భర్త విక్రమ్ మందలించాడు. చెరువు వద్ద ఇద్దరికీ మాట మాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని పాత కక్షలని మనసులో పెట్టుకుని తనపై దాడి చేసినట్లు మహేశ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తన చేతి వేలికి గాయం చేశాడని సర్పంచ్ భర్త విక్రమ్ మహేశ్​పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చెరువు వద్ద యువకుడితో సర్పంచ్ భర్త వాగ్వాదం.. పరస్పర దాడి

ఇవీ చూడండి : నాగార్జున సాగర్​ 16గేట్లు ఎత్తి నీటి విడుదల

Last Updated : Aug 21, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.