ETV Bharat / international

పాక్​ దుశ్చర్య- దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

author img

By

Published : Dec 12, 2020, 10:28 PM IST

pak army
పాక్​ దుశ్చర్య- దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

పాకిస్థాన్ మరోసారి తన దుర్నీతిని బయటపెట్టింది. పుంఛ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. అయితే.. ఈ చర్యలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పాకిస్థాన్​ దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలపై కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్​లోని పుంఛ్​​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిన్న చిన్న ఆయుధాలు, మోర్టార్​ షెల్స్​తో దాడులకు పాల్పడినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

నియంత్రణ రేఖ వెంబడి బాలాకోట్​ సెక్టార్​లో సాయంత్రం 6 గంటలకు ఈ దాడులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ దాడికి భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని పేర్కొన్నారు. మన సైనికుల్లో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

భద్రతా బలగాలే లక్ష్యంగా..

బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద భద్రతా బలగాలపై దాడులకు యత్నించారు ముష్కరులు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.

JK-FIRING Pak army violates ceasefire along LoC in J-K's Poonch
గ్రనేడ్ దాడిలో గాయపడ్డ పౌరునికి చికిత్స
JK-FIRING Pak army violates ceasefire along LoC in J-K's Poonch
గ్రనేడ్​ దాడుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించిన భద్రతా బలగాలు

సోపోర్​ బస్​స్టాప్​ వద్ద ఉన్న సైనికులపై గ్రనేడ్​ దాడులకు ఉగ్రవాదులు యత్నించారు. అయితే.. అవి బలగాలపై కాకుండా రోడ్డుపక్కన పడ్డాయి. ఈ పేలుడులో ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'సైన్యం దాడిలో 90 మంది తాలిబన్లు బలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.