ETV Bharat / international

సోమాలియాలో బాంబు దాడి- 20మంది మృతి

author img

By

Published : Mar 6, 2021, 5:52 PM IST

Death toll in bombing in Somalia's capital rises to 20
సోమాలియాలో బాంబు దాడి- 20మంది మృతి

సోమాలియాలో బాంబు దాడి జరిగింది. పేలుడు పదార్థాలు కలిగిన ఓ వాహనం రెస్టారెంట్​లోకి దూసుకెళ్లేలా చేసి.. దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. నగరంలోని ఓ రెస్టారెంటులో బాంబులతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

శుక్రవారం రాత్రి.. పేలుడు పదార్థాలతో ఓ వాహనం నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లేలా చేసి.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిగా.. రెస్టారెంట్‌తో పాటు సమీపంలోని గృహ సముదాయాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటన వెనుక స్థానిక ఉగ్రవాద సంస్థ అల్‌-షబాబ్‌ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంస్థకు అల్‌ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: 'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చైనా దూకుడుకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.