ETV Bharat / crime

యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి

author img

By

Published : Apr 29, 2022, 6:54 PM IST

Updated : Apr 29, 2022, 7:39 PM IST

two stairs building collapsed in yadagirigutta
యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం

18:51 April 29

యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం

యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం

Building Collapsed in Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా కూలిన రెండంతస్తుల భవనాన్ని.. 30 ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు హంతకుడికి ఉరిశిక్ష

శ్రీలంక ప్రధాని మార్పు.. త్వరలో మధ్యంతర ప్రభుత్వం?

Last Updated :Apr 29, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.