ETV Bharat / crime

గ్యాంగ్​ రేప్​ కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

author img

By

Published : Jun 4, 2022, 4:53 PM IST

Updated : Jun 4, 2022, 9:08 PM IST

Three accused remanded in jubilee hillsminor girl rape case
Three accused remanded in jubilee hillsminor girl rape case

16:46 June 04

ఘటనకు పాల్పడిన ఇన్నోవా వాహనం స్వాధీనం

Three accused remanded in jubilee hillsminor girl rape case
అత్యాచార కేసులో ఏ2గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌

Minor Girl Rape Case: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్​ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆ ముగ్గురు నిందితులను రిమాండ్​కి తరలించారు. జూబ్లిహిల్స్ ఠాణాలో సాదుద్దీన్ మాలిక్​ను విచారించిన పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం.. వనస్థలిపురంలోని నాయమూర్తి ఇంట్లో సాజిద్​ను హాజరుపరిచారు. సాజిద్​కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అరెస్టయిన మరో ఇద్దరు నిందితులైన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్​ కుమారునితో పాటు ఇంకో మైనర్​ను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన అనంతరం.. ఇద్దరిని జువెనైల్ హోంకి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని కర్ణాటకలో ఆదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ఉమర్​ఖాన్​తో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. వారిని రేపు రిమాండ్​కు తరలించనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. మొయినాబాద్‌లో కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇన్నోవా కారును జూబ్లీహిల్స్ పీఎస్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం క్లూస్ టీం ఆదారాలు సేకరిస్తోంది. అయితే.. అత్యాచారానికి పాల్పడ్డ కారు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్​ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో ఇప్పటికే బాలికకు భరోసా సెంటర్​లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎఫ్‌ఎస్​ఎల్​కి పంపారు. ప్రస్తుతం బాలికకు ఆరోగ్యంగా ఉందని పోలీసులు తెలిపారు.

కేసులో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్​పై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని మొదట భావించిన పోలీసులు.. ఈ మొత్తం ఘటనలో ఐదుగురు మాత్రమే పాల్గొన్నట్లు ధ్రువీకరించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 4, 2022, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.