ETV Bharat / crime

GOLD THEFT: నమ్మకంగా ఉన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు

author img

By

Published : Aug 23, 2021, 4:04 PM IST

Updated : Aug 23, 2021, 4:40 PM IST

gold theft
బంగారంతో పరారీ

16:03 August 23

GOLD THEFT: నమ్మకంగా ఉన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు

బంగారు నగల తయారీలో నలుగురి దగ్గర నమ్మకం సంపాదించాడు. దీంతో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారుల వద్ద నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇదే అదనుగా భావించి భారీ ఎత్తున బంగారంతో పరారయ్యాడు ఓ ఆభరణాల తయారీదారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల 9 మంది వ్యాపారులు ఆభరణాలు తయారుచేసేందుకు 10 కేజీల బంగారాన్ని దిలీప్​ కుమార్​ అనే నగల తయారీదారుకు ఇచ్చారు. వాటిని కాజేయాలని చూసిన దిలీప్​.. ఆ బంగారాన్ని తీసుకొని ఇంట్లో లేఖ పెట్టి పారిపోయారు.

విజయవాడ బస్టాండులో బంగారం ఉన్న బ్యాగు పోయిందని దిలీప్​ లేఖలో పేర్కొన్నాడు. విజయవాడ నుంచి బందరు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని లేఖలో వివరించాడు. దీంతో బంగారం ఇచ్చిన 9 మంది వ్యాపారులు.. దిలీప్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. నిందితుడు మంగళగిరి వాసిగా పోలీసులు గుర్తించారు. 

ఇదీ చదవండి: Etela rajender: ఫోటోలు తీశాడని ఏఎస్​ఐతో భాజపా కార్యకర్తల డిష్యుం..డిష్యుం..

Last Updated : Aug 23, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.