ETV Bharat / city

ఉద్యోగులందరూ భారత్​ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలి: టీఎన్జీవో

author img

By

Published : Dec 7, 2020, 3:53 PM IST

రేపటి భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్లు టీఎన్జీవో ప్రకటించింది. ఉద్యోగులందరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని సంఘం మామిళ్ల రాజేందర్ కోరారు. రైతుల పోరాటానికి రాష్ట్ర ప్రజల తరఫున కేసీఆర్ మద్దతు చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు.

tngo
tngo

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ప్రకటించిన రేపటి భారత బంద్​కు తెలంగాణ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. రేపటి బంద్‌లో పాల్గొనాలని వారు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బంద్​లో పాల్గొంటున్నామని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రకటించారు.

అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో బంద్​లో పాల్గొంటామని, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బంద్ సందర్భంగా ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.