ETV Bharat / city

Schools upgrade: ఆ పాఠశాలలు ఇకపై హైస్కూల్ ప్లస్.. ప్రత్యేకంగా వారి కోసమే..!

author img

By

Published : Jul 7, 2022, 9:29 PM IST

SCHOOLS UPGRADE: ఏపీలో 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​గా మార్పు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది.

Schools upgrade
ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​

Schools upgrade: ఏపీ వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​గా మార్పు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్​ను అనుసరించి కోర్సులు నిర్ధారించాలని నిర్ణయించింది.

పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలలలో పని చేసేందుకు నియమిస్తామని వెల్లడించింది. పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేపట్టిన దృష్ట్యా.. అదనపు తరగతి గదులను మంజూరు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు: కేటీఆర్

ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!.. శిందే గ్యాంగ్ దూకుడు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.