ETV Bharat / business

Stock market today: కోలుకున్న సూచీలు.. సెన్సెక్స్​ 198 ప్లస్​

author img

By

Published : Nov 23, 2021, 3:45 PM IST

Stock market today
స్టాక్​ మార్కెట్లు

(Stock market today) దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మంగళవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. ప్రారంభంలో తీవ్ర ఒడుదొడుకుల లోనైన మార్కెట్లు.. మిడ్​ సెషన్​ నుంచి తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్​ (sensex today) 198, నిఫ్టీ (nifty today) 87 పాయింట్ల మేర పెరిగాయి.

స్టాక్ ​మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. సోమవారం భారీ నష్టాలను నమోదు చేసిన అనంతరం.. ఆర్థిక, లోహ, ఫార్మా రంగం షేర్లు(Stocks in news) రాణించడం కారణంగా మంగళవారం లాభాల బాట పట్టాయి. దీంతో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి.. 58,664 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ (nifty today) 198 పాయింట్ల లాభంతో 17,503 వద్ద సెషన్​ను(Stock market news) ముగించింది.

ఇంట్రాడేలో ఇలా..

  • బీఎస్​ఈ సెన్సెక్స్​ 58,834 పాయింట్ల గరిష్ఠాన్ని.. 57,718 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
  • ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 17,553 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 17,216 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, సన్​ఫార్మా, బజాజ్​ ఫిన్​సర్వ్​, టెక్​ మహీంద్ర షేర్లు (Stocks in news) రాణించాయి.
  • ఏషియన్ పెయింట్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, మారుతీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి: అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదానికి త్వరలోనే చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.