ETV Bharat / bharat

ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు

author img

By

Published : Feb 17, 2023, 10:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఇంటి సమీపంలో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

UP CM Home Bomb
UP CM Home Bomb

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇంటి సమీపంలో బాంబు ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లఖ్​నవూ పోలీసులు యోగి ఇంటి సమీపంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబ్​ స్క్వాడ్​ సహాయంతో కూంబింగ్​ ఆపరేషన్​ నిర్వహించారు. కాగా, బాంబుకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడం వల్ల అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాళీదాస్​ మార్గ్​లోని సీఎం యోగి ఇంటి వద్ద బాంబు ఉందని తమకు సమాచారం వచ్చిందని లఖ్​నవూ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.

ఫేక్​ ఐడీ.. వరుస ట్వీట్లతో బెదిరింపులు..
అయితే యోగికి ఇటువంటి బెదిరింపు సందేశాలు రావడం కొత్తేమి కాదు. ఇంతకుముందు ఆదిత్యనాథ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తానని ట్విట్టర్​లో బెదిరించాడు. అంతేగాక యోగి భద్రతా సిబ్బందిని కూడా బాంబు పెట్టి చంపేస్తామని హెచ్చరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.