ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

author img

By

Published : Nov 3, 2021, 6:31 PM IST

నాలుగేళ్ల చిన్నారిపై పెట్రోల్​ పోసి నిప్పటించాడు ఓ దుండగుడు. హరియాణా గురుగ్రామ్​లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

murder
నాలుగేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

హరియాణాలోని గురుగ్రామ్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడో కిరాతకుడు. దుండగుడి దాడికి గురైన మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పటౌదీ గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వాగ్వాదంతో మొదలై..

రోహ్​తక్​కు చెందిన నిందితుడు రింకూతో సుమన్​ అనే మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వీరి మధ్య మరోసారి గొడవ జరగడం వల్ల సుమన్​ ఆమె పుట్టింటికి వచ్చింది. సుమన్​ను ఇంటికి తీసుకొచ్చేందుకు మంగళవారం రింకూ పటౌదీకి వెళ్లాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడం వల్ల రింకూ ఆవేశంలో అక్కడే ఉన్న సుమన్​ సోదరుడి పిల్లలు నరేశ్​, మాన్వీపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు.

చిన్నారులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నరేశ్​ మృతిచెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : మూఢనమ్మకాలకు 11 ఏళ్ల బాలిక బలి- తండ్రి, మత గురువు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.