ETV Bharat / bharat

Rahul lynching: '2014కు ముందు 'మూకదాడి' పదమే వినలేదు'

author img

By

Published : Dec 21, 2021, 4:44 PM IST

Rahul Gandhi On Lynching: 2014కు ముందు దేశంలో తాను 'మూకదాడి' అన్న పదమే వినలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు 'థ్యాంక్యూ మోదీజీ' అంటూ ట్విట్టర్​లో ఎద్దేవా చేశారు. లఖింపుర్ ఖేరీ ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు రాహుల్.

Rahul Gandhi On Lynching
రాహుల్ గాంధీ

Rahul Gandhi On Lynching: కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ.. కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2014కు ముందు.. అంటే భాజపా అధికారంలోకి రాకముందు దేశంలో 'మూకదాడి' అన్న పదం అంటే ఏంటో తెలియదన్నారు. ఈ మేరకు 'థ్యాంక్యూ మోదీజీ' అంటూ ట్విట్టర్​లో ఎద్దేవా చేశారు రాహుల్.

Rahul Gandhi On Lynching
కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ ట్వీట్

అయితే రాహల్​ ట్వీట్​పై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్​ గాంధీ తండ్రి రాజీవ్​ గాంధీ.. 'మూకదాడులకు ఆద్యుడు'గా అభివర్ణించారు. 1984 అల్లర్లలో వందలమంది సిక్కుల హత్యలు మూకదాడి కాదా? అని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రశ్నించారు.

1989లో జరిగింది మూకదాడి కాదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు చౌబే. కాంగ్రెస్ పాలనలో 1969 నుంచి 1993 వరకు దేశంలో అనేక మూకదాడులు జరిగాయని భాజపా ఐటీ డిపార్ట్​మెంట్​ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్​ చేశారు.

అమృత్​సర్​లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ యువకుడ్ని కొట్టిచంపారు కొందరు భక్తులు. ఈ ఘటన డిసెంబరు 18న జరిగింది. డిసెంబరు 19న కపుర్తలాలోని నిజాంపుర్​లో సిక్కుల జెండాను అగౌరవపరిచాడన్న కారణంతో మరో వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి కూడా చనిపోయాడు.

అతన్ని వదిలిపెట్టం..

Rahul Gandhi On Lakhimpur Kheri: లఖింపుర్​ ఖేరీ ఘటనపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్. ఈ ఘటనకు కారణమైన వాళ్లు ఈరోజు లేదా తర్వాతైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. అతన్ని తాము వదిలిపెట్టమన్నారు.

"మరోసారి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఓ కేంద్రమంత్రి కుమారుడు రైతులకు చంపాడు. ఇది కుట్రపూరితంగా జరిగిందని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. ప్రధాని ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మీరు రైతులకు క్షమాపణ చెప్పారు. కానీ ఈ ఘటనపై స్పందించడం లేదు."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాహుల్​గాంధీ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీఎంసీదే 'కోల్​కతా' పీఠం.. భాజపాపై దీదీ సెటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.