ETV Bharat / bharat

Petrol Bomb Attack On Rajbhavan : రాజ్​భవన్​పై పెట్రోల్​ బాంబు దాడి.. గవర్నర్​పై కక్ష పెంచుకుని..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 5:45 PM IST

Updated : Oct 25, 2023, 7:01 PM IST

Petrol Bomb Attack On Rajbhavan Tamilnadu : తమిళనాడు రాజ్​భవన్​పై పెట్రోల్​ బాంబు దాడి కలకలం రేపింది. గవర్నర్​పై కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Petrol Bomb Attack On Rajbhavan Tamilnadu
Petrol Bomb Attack On Rajbhavan Tamilnadu

Petrol Bomb Attack On Rajbhavan Tamilnadu : తమిళనాడు.. రాజభవన్​పై పెట్రోల్ దాడి కలకలం సృష్టించింది. గిండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉన్న గవర్నర్​ నివాసం మెయిన్​ గేట్​పై వినోద్​ అనే వ్యక్తి పెట్రోల్​ బాంబ్ (Molotov cocktail- అంటే సీసాలో పెట్రోల్​ నింపి గుడ్డతో మండిస్తారు)​తో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పదించి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిని.. రాజ్​భవన్​పై పెట్రోల్ బాంబు విసిరేయడం వెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకోడానికి అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని.. నిందితుడు కేవలం ఒక పెట్రోల్​ బాంబు మాత్రమే ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు.

  • #WATCH | Tamil Nadu: A petrol bomb was hurled outside Raj Bhavan today in Chennai. A complaint has been lodged in Guindy police station.

    Further details awaited. pic.twitter.com/irbfkZ3sYL

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌ వెలుపల బారికేడ్‌ల దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్‌ బాంబులను విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గమనించి.. వెంటనే అతడిని చుట్టుముట్టారు. అనంతరం అతడి చేతిలో ఇతర పెట్రోల్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేవు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్​భవన్​ వద్ద సరైన బందోబస్త్ ఉంది. నిందితుడిని హిస్టరీ-షీటర్‌ కె వినోద్‌గా గుర్తించాం. అతడు ఓ నేరస్థుడు.. అతడిపై ఇప్పటికే 6-7 కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది."
--చెన్నై పోలీసు అదనపు కమిషనర్‌ ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా

  • #WATCH | Chennai, Tamil Nadu: Prem Anand Sinha, Additional Commissioner of Police says, "Around 3 pm, an unidentified person tried to throw some bottles of petrol outside Raj Bhavan near barricades. As soon as this was noticed by the security personnel present there, they… https://t.co/KxgoIOVljc pic.twitter.com/WlqJsxLCoz

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే మూడు రోజుల క్రితం జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్​ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. ​ఈ ఘటన తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై.. రాష్ట్రంలో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిని ఈ దాడి ప్రతిబింబిస్తుందని విమర్శించారు.

Petrol Bomb at BJP Office : తమిళనాడులో గతేడాది ఫిబ్రవరిలో ఇలాంటి ఘటన జరిగింది. తమిళనాడులోని భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరేశారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని అప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది. అప్పుడు కూడా రాష్ట్ర భాజపా చీఫ్​ అన్నామలై స్పిందించి.. నేరస్థున్ని తప్పకుండా శిక్షించాలని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయంపై బాంబు దాడి.. కిటికీలు, తలుపులు ధ్వంసం

BJP నేత కుమారుడి కారుపై బాంబుల దాడి.. వారిపైనే డౌట్!

Last Updated : Oct 25, 2023, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.