ETV Bharat / bharat

ముంబయిలో కరెంట్​ కట్.. గంటలపాటు ప్రజలకు అవస్థలు!

author img

By

Published : Apr 26, 2022, 1:54 PM IST

POWER OUTAGE
కరెంటు కోతలు

Mumbai Power Cut: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటకుపైగా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది.

Maharashtra Power Outage: ముంబయి సహా మహారాష్ట్రలోని ఠాణె, కల్యాణ్ వంటి పలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా గంటకుపైగా నిలిచిపోయింది. ట్రాన్స్​మిషన్ లైన్​ ట్రిప్పింగ్ వల్ల మంగళవారం ఉదయం ఈ పరిస్థితి వచ్చింది. మహారాష్ట్ర.. దాదాపు 2,500 మెగావాట్ల విద్యుత్ లోటుతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. విద్యుత్​ లోటు వల్ల రాష్ట్ర డిస్కం కొన్ని నగరాలకు గంటలపాటు సరఫరా నిలిపివేయడం అనివార్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి, 2020 అక్టోబర్​లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.

మంగళవారం విద్యుత్​ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ముంబయిలోని దాదర్, మాటుంగా, భాండప్​, ములుండ్​​ ఉన్నాయి. మెట్రోపాలిటన్​ చట్టుపక్కల ప్రాంతాలైన ఠాణె, కల్యాణ్, డోంబివలిలో ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా కరెంటు నిలిపోయింది. కల్యాణ్​ సమీపంలోని పడ్​ఘా సబ్​స్టేషన్​లో సమస్య తలెత్తడం వల్లే సరఫరా ఆగిపోయిందని అధికారులు తెలిపారు. గంట తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఆర్థిక రాజధాని ముంబయిలో సాధారణంగా కరెంటు కోతలు ఉండవు. కానీ కొన్నిసార్లు ఊహించని సమస్యలు తలెత్తడం వల్ల విద్యుత్​ సరఫరా నిలిచిపోతుంది. 2020 అక్టోబర్​లో ముంబయి నగరం దాదాపు 18 గంటలపాటు అంధకారంలో ఉంది.

ఇదీ చదవండి: రెండు వారాలకే పాడయిన ఎలక్ట్రిక్ స్కూటర్​.. గాడిదకు కట్టి ఊరేగింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.