ETV Bharat / bharat

మోదీ వస్తున్నారని మోర్బీ ఆస్పత్రికి రంగులు.. పరామర్శ పేరిట ఫొటోషూట్​ అంటూ విమర్శలు

author img

By

Published : Nov 1, 2022, 5:11 PM IST

మోర్బీ క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడానికి ముందు ఆ ఆస్పత్రికి పెయింట్​ వేయించడం పట్ల ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఫొటో షూట్ల కోసమే అని మండిపడ్డారు.

Morbi hospital
modi to visit morbi hospital

ప్రధాని పర్యటనకు ముందు మోర్బీ ప్రమాదంలో గాయపడ్డ వారు ఉన్న ఆస్పత్రికి రంగులు వేయడం రాజకీయంగా వివాదాస్పదమైంది. క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో అసలు ఇన్ని హంగులు ఎందుకు అని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఈ మేరకు ఆస్పత్రికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆప్​ ఎమ్మెల్యే సౌరభ్​ శుక్లా ట్విట్టర్​లో షేర్​ చేశారు. "ఏదైనా విషాదం జరిగిన ఇంటికి మనం పెయింట్ వేస్తామా? ఆసుపత్రి ఆవరణలో కనీసం 134 శవాలు పడి ఉన్నాయి. అలాంటి ఆస్పత్రికి హంగులు అద్దుతున్నారు" అని సౌరభ్​ పోస్ట్ చేశారు.

  • किसी के घर में मृत्यु हो जाए, तो रंगाई पुताई करवाता है ?

    अस्पताल के अंदर 134 लाशे पड़ी है, और हॉस्पिटल की रंगाई पुताई का काम चल रहा है । pic.twitter.com/dBxYJhNXAD

    — Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) November 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎమ్మెల్యే అప్‌లోడ్ చేసిన చిత్రాలను దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా రీట్వీట్ చేశారు. "గత 27 ఏళ్లుగా గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. మరి ఇంతటి విషాద సమయంలో ఆసుపత్రికి ఇలా రంగులు వేయించడం సిగ్గుచేటు" అని వ్యాఖ్యానించారు.
ఆస్పత్రి వద్ద పనులు జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వేళ వాటిని కాంగ్రెస్​ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. అసలు ఇదంతా మోదీ ఫొటో షూట్​ కోసం జరుగుతున్న ఆర్భాటం అని మండిపడ్డారు.

వంతెన ఘటనపై సుప్రీం కోర్టులో పిల్​
మరోవైపు.. గుజరాత్‌ మోర్బీ వంతెన ఘటనపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని నవంబర్ 14న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. వంతెన ప్రమాదం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమని.. ఈ పిల్​ను వీలైనంత త్వరగా కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆశించానని పిటిషనర్ విశాల్​ తివారీ​ వ్యాఖ్యానించారు.

మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది మరణించగా, 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని గుజరాత్​ ప్రభుత్వం తెలిపింది. సాయుధ బలగాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)తో పాటు మరి కొన్ని ఏజెన్సీలు మచ్చు నదిలో రెస్క్యూ ఆపరేషన్​ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. రక్షించిన వారిలో 14 మంది మాత్రమే ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

ఇదీ చదవండి: 'ఆమ్​ ఆద్మీకి భారీగా ముడిపులిచ్చా'.. సుకేశ్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు

'అలా చేయకపోతే దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.