ETV Bharat / bharat

లారీ డ్రైవర్ మద్యం మత్తుకు కవల పిల్లలు, తల్లి బలి

author img

By

Published : Dec 20, 2021, 10:55 AM IST

Updated : Dec 20, 2021, 1:16 PM IST

Horrific road accident in Karnataka: లారీ డ్రైవర్ నిర్లక్షపూరిత డ్రైవింగ్​.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది​. ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు వారి పిల్లలను లారీ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో పిల్లల శరీరాలు లారీ టైర్​ కింద నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన పిల్లల తల్లి.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.

Horrific road accident in Karnataka
లారీ డ్రైవర్ మద్యం మత్తుకు కవల పిల్లలు, తల్లి బలి

Karnataka road accident: కర్ణాటక హసన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గుర్ని బలిగొంది. ఓ ద్విచక్రవాహనాన్ని లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టగా.. కవల పిల్లల శరీరాలు లారీ టైరు కింద నుజ్జునుజ్జు అయ్యాయి. వారి తల్లి సైతం తీవ్రంగా గాయపడి, కాసేపటికి మరణించింది.

అప్పటికే నాలుగు వాహనాల్ని ఢీకొట్టి...

ఆదివారం రాత్రి శివానంద్​, జ్యోతి దంపతులు.. వారి కవల పిల్లలు ప్రణతి(3), ప్రణయ్​(3)తో కలిసి ద్విచక్రవాహనంపై హసన్ శివార్లలో జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్.. అప్పటికే నాలుగు వాహనాలను ఢీకొట్టాడు. మితిమీరిన వేగంతో లారీ ఢీకొట్టడం వల్ల నాలుగు వాహనాలు ఎగిరిపడ్డాయి. బైక్​ను ఢీకొట్టిన తర్వాత.. కవల పిల్లలు లారీ టైరు కింద పడ్డారు. వారిని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు లారీ డ్రైవర్. చిన్నారుల శరీరాలు నుజ్జునుజ్జు కాగా... అక్కడికక్కడే మరణించారు.

తీవ్రంగా గాయపడిన శివానంద్ దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మరణించగా.. శివానంద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటన తర్వాత లారీ డ్రైవర్​ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్​ నిర్లక్షం వల్లే ఈ ఘటన జరిగిందని, అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:- మద్యం మత్తు.. అతివేగం.. నిర్లక్ష్యం.. 15 మంది దుర్మరణం

Last Updated : Dec 20, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.