ETV Bharat / bharat

పీఎం కేర్స్ విరాళాల​పై లోక్​సభలో గందరగోళం

author img

By

Published : Mar 15, 2021, 5:27 PM IST

Cong, govt spar in Lok Sabha over donations to PM Cares Fund
పీఎం కేర్స్​పై లోక్​సభలో రచ్చ

పీఎం కేర్స్​ విరాళాలపై లోక్​సభలో వాడీవేడీ చర్చ జరిగింది. కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకోవడం మాని, పీఎం కేర్స్​కు ఎల్​ఐసీ డబ్బులిచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​ ద్వారా చైనా నుంచి కాంగ్రెస్​ నిధులు పొందిందని విమర్శించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.

పీఎం కేర్స్​ నిధికి అందిన విరాళాలపై లోక్​సభలో.. ప్రభుత్వం- ప్రతిపక్ష కాంగ్రెస్​ మధ్య సోమవారం తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి బదులు ప్రభుత్వానికి.. ఎల్​ఐసీ నిధులిచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు చైనా నుంచి నిధులొచ్చాయని విమర్శించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.

లాక్​డౌన్​లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్​ లోక్​సభా పక్ష నేత రవ్​నీత్ సింగ్ విమర్శించారు. బదులుగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు అనురాగ్. ఈ నేపథ్యంలో.. ఒక కుటుంబం మాత్రం రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​ ద్వారా తన ఖాతాలను నింపుకుందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'శాసనసభ ఎన్నికల్లో బీఎస్​పీ ఒంటరి పోరు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.