ETV Bharat / bharat

12వేల జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి.. వధువులకు ప్రభుత్వం నజరానా!

author img

By

Published : Jun 13, 2022, 11:13 AM IST

Updated : Jun 13, 2022, 11:21 AM IST

Mass Wedding: ఆ రాష్ట్రంలో శుక్రవారం అనేక ప్రాంతాల్లో పెళ్లి భాజాలు మోగాయి. వివాహ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు. బంధుమిత్రుల సమక్షంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 వేల జంటలు వివాహ బంధంలో అడుగుపెట్టాయి. ఈ అరుదైన సంఘటన ఎక్కడ జరిగిందంటే?

Mass Wedding
దండలు మార్చుకుంటున్న వధూవరులు

UP Mass Weddings: ఉత్తర్​ప్రదేశ్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో శుక్రవారం వేలాది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్లిళ్ల ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ పరిణయాల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం.. ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమ చేసింది.

Mass Wedding
దండలు మార్చుకుంటున్న వధూవరులు

లఖ్​నవూలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొన్నారు. రెండో విడత సామూహిక వివాహాలు ఈ నెల 17న నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం.. ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. సంభాల్ జిల్లాలో అత్యధికంగా 419 జంటలు ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.

Mass Wedding
వివాహ అనంతరం ఊరేగింపుగా వెళ్తున్న నూతన జంటలు

ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్.. పక్కా ప్లాన్​తో..

'వందేమాతరం.. మనదే రాజ్యం'.. బ్రిటిష్​పై పోరాడుతూ వీరుడి ప్రాణత్యాగం!

Last Updated : Jun 13, 2022, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.