ETV Bharat / bharat

Covid related loans: 'కరోనా' రుణ గ్రహీతలు 1.33 లక్షల మంది

author img

By

Published : Aug 22, 2021, 7:26 AM IST

Updated : Aug 22, 2021, 9:19 AM IST

కొవిడ్ చికిత్స(Covid treatment) కోసం దేశవ్యాప్తంగా 1.33 లక్షల మంది బ్యాంకుల నుంచి అప్పులు(Covid related loans) తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. రుణ గ్రహీతల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆసుపత్రుల్లో చేరిన ఖాతాదారుల కుటుంబ సభ్యుల కోసం బ్యాంకులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఇచ్చాయి.

covid loans
రుణ బాధితులు

కరోనా చికిత్స(Covid treatment) కోసం దేశవ్యాప్తంగా 1.33 లక్షల మంది బ్యాంకుల నుంచి అప్పులు(Covid related loans) తీసుకున్నట్లు ఆర్థికశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, ​బంగాల్‌, మహారాష్ట్రలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు బిల్లులు వేయటంతో వాటిని చెల్లించడానికి చాలామంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

loan
ఆస్పత్రి ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారి సంఖ్య

ఆసుపత్రుల్లో చేరిన ఖాతాదారుల కుటుంబ సభ్యుల కోసం బ్యాంకులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఇచ్చాయి. కరోనా కారణంగా అప్పటికే ఉపాధి, ఉద్యోగావకాశాలు దెబ్బతిన్న ఎంతోమంది బ్యాంకులు అందించిన ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఆసుపత్రుల ఫీజులు చెల్లించారు. కేవలం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారే 1.33 లక్షలమంది ఉన్నారు.

ఆసుపత్రుల ఫీజులు చెల్లించడానికి ఇతర ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు మార్గాలలో రుణాలు తీసుకున్నవారు అదనం.

ఇదీ చదవండి: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​

Last Updated :Aug 22, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.