PRATIDWANI: జంబో పాలకమండలి కూర్పుతో లాభనష్టాలేంటి?
తిరుమల తిరుపతి దేవస్థానం! ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రాల్లో మొదటిస్థానంలో ఉంటుంది.. ఈ కలియుగ వైకుంఠం. సుసంపన్న ధార్మిక క్షేత్రాల్లోనూ తిరుమల క్షేత్రానిది ముందు వరస. అక్కడ జరిగే ప్రతిపరిణామాన్నీ ఆసక్తిగా గమనిస్తుంటారు భక్తకోటి. దర్శనభాగ్యాల నుంచి ఆలయ నిర్వహణకు సంబంధించిన అన్నింటిపై.. ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంపై వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. తితిదే పాలకలమండలి కూర్పు ఎలా ఉంది, భారీగా ప్రత్యేక ఆహ్వానితుల ఎంపిక ఎందుకు? ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి? ధార్మిక వర్గాల నుంచి ఆందోళనకు కారణం ఏమిటి?