ప్రైవేటు అప్పుల ఊబిలో రైతులు.. పంటరుణాలపై బ్యాంకుల లక్ష్యాలేంటి?
వ్యవసాయంలో ఖర్చులు అధికమై, రైతులపై పెట్టుబడుల భారం పెరిగింది. పంట కాలానికి అనుగుణంగా రుణ ప్రణాళికలు విడుదల చేస్తున్న బ్యాంకులు రైతులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయడంలో తడబడుతున్నాయి. పాత బాకీల వసూళ్లు, రుణమాఫీ హామీలు, వడ్డీ రాయితీల సర్దుబాట్లతోనే అదును దాటిపోతోంది. బ్యాంకుల్లో సకాలంలో రుణాలు లభించని రైతులు విధిలేక ప్రైవేటు అప్పుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఏటా అట్టహాసంగా ప్రకటిస్తున్న రుణ ప్రణాళికలు లక్ష్యం చేరకుండానే నిలిచిపోతున్నాయి. బ్యాంకు రుణాలపై ఆశలు పెట్టుకున్న సగటు రైతుకు కండ్లల్లో నీళ్లు మిగులుతున్నాయి. అసలు బ్యాంకుల రుణ ప్రణాళికలకు, రుణాల మంజూరు మధ్య అగాథం ఎందుకు ఏర్పడుతోంది? ప్రైవేటు అప్పుల్లో కూరుకుపోతున్న రైతులను ఆదుకునే మార్గాలేంటి.. ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.