'తినడానికి తిండి లేకుంటే.. మీకు మద్యం కావాలా..?'
హైదరాబాద్లో ఓ మహిళ మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వారిని చితకబాదింది. కరోనా వల్ల ఆకలితో ఇబ్బంది పడుతుంటే మీకు మద్యం కావాలా అంటూ నిలదీసింది. లాక్ డౌన్లో ఇబ్బంది పడుతున్న జనాల కోసం ఆమె కొన్ని రోజులుగా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే వైన్ షాపులు తెరవగానే అందరూ వాటి ముందు బారులు తీరడంతో ఆమెకు కడుపు రగిలిపోయింది. ఆవేశంగా వైన్ షాపు దగ్గరకు కర్రతో వచ్చి కొట్టేసింది. భౌతిక దూరం పాటించకుండా వైరస్ వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. వరుసలో నిలబడ్డవారందరినీ కర్రతో తరిమింది. ఆమె అంత ఆవేశంగా జనాలను తరుముతూ ఉంటే అక్కడే ఉన్న పోలీసులు కూడా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.
Last Updated : May 8, 2020, 2:11 PM IST