ఎమ్మెల్యే కోన రఘుపతికి టికెట్ ఇస్తే టీడీపీలో చేరుతాం: జెడ్పీటీసీ సురేఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 12:24 PM IST

thumbnail

YSRCP ZPTC Surekha Allegations Against Bapatla MLA: బాపట్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, జెడ్పీటీసీ సభ్యురాలు సురేఖ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం రఘుపతికి సీటు ఇస్తే, తామంతా  తెలుగుదేశం పార్టీలో చేరుతామన్నారు. ఎమ్మెల్యే రఘుపతి దళిత వర్గానికి చెందిన మమ్మల్ని పలుమార్లు అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఎస్సీ మహిళకు సీటు ఇచ్చామని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకున్నారని సురేఖ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేస్తామంటే అవహేళనగా మాట్లాడారన్నారని తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో కోన రఘుపతికి కాకుండా మరెవ్వరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని సురేఖ వెల్లడించారు.  నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని సురేఖ కోరారు. అధిష్ఠానం అన్ని ఆలోచించి ఎమ్మెల్యే టిక్కెట్​ను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే, అందరం కలిసికట్టుగా కష్టపడి పని చేసి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామన్నారు. ఎమ్మెల్యే కోనపై వివిధ సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సురేఖ తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.