తుస్సు మంటున్న వైసీపీ బస్సు యాత్రలు - సభ మధ్యలోనే ఇంటిముఖం పడుతున్న కార్యకర్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 9:29 PM IST

thumbnail

YSRCP Samajika Sadhikara Bus Yatra in Palasa: ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బెడిసికొడుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర.. తుస్సు మంటోంది. ప్రజలు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. కార్యక్రమానికి ఏదో ఒకలా బెదిరించి తీసుకొస్తున్నా.. వారంతా మధ్యలోనే వెళ్లిపోతున్నారు. దీంతో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మంత్రులు సైతం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారికి.. కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ కార్యకర్తలు నిరాశకు లోనైయ్యారు. దీంతో విసుగుచెంది చాలా మంది సభ మధ్యలోనే.. ఇంటిముఖం పట్టారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.