YSRCP Oppose No Confidence Motion in Lok Sabha: అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం: వైసీపీ ఎంపీ మిథున్​రెడ్డి

By

Published : Aug 9, 2023, 7:28 PM IST

thumbnail

YSRCP Oppose No Confidence Motion in Lok Sabha : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి లేవనెత్తిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. బుధవారం లోక్​సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో లోక్‌సభ పక్షనేత, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్​సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సభకు తెలిపారు. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నందున ఈ అవిశ్వాస తీర్మానానికి విలువ లేదని తమ పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు. మణిపుర్‌లో మహిళలపై చోటు చేసుకున్న ఘటనలు చాలా బాధాకరం అన్న మిథున్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అక్కడ శాంతి స్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన లోక్​సభలో కోరారు.

"మణిపుర్‌లో మహిళలపై జరిగిన నేరాలు చాలా బాధాకరం. వీలైనంత త్వరగా అక్కడ శాంతి స్థాపన జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానానికి విలువ లేదని మేము భావిస్తున్నాం."- మిథున్‌రెడ్డి, లోక్‌సభ పక్షనేత

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.