అధికార వైసీపీ నాయకుల దౌర్జన్యం - దళితుల భూముల కబ్జా యత్నంపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 10:45 PM IST

thumbnail

YSRCP Leaders Occupied MRPS Leaders Lands: అధికార పార్టీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై తమ భూములను కబ్జా చేస్తున్నారని ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు ఆ భూములకు పట్టాలు జారీ చేశారని, కానీ, కొంతమంది ఎమ్మెల్యే అండతో ఈ చర్యకు పూనుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాల్లో కంచె ఏర్పాటు చేసి వెంచర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని వారు అన్నారు.

అనంతపురం జిల్లాలోని  కురుగుంట గ్రామంలోని 41 సర్వేనెంబర్​లో 6ఎకరాల భూమి ఉందని ఎమ్మార్పీఎస్​ నాయకులు తెలిపారు. దానిని 2010లో తమకు స్థలాలు మంజూరు చేస్తూ పట్టాలు జారీ చేశారని వివరించారు. కానీ, కొంత మంది అధికార పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యే అండతో కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. తామ భూముల్లో వెంచర్​ ఏర్పాటుకు వైసీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. పేదలకు కేటాయించిన భూములను ఇలా అక్రమించుకోవడం సరికాదని హెచ్చరించారు. తమ స్థలాలను సాధించుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.