YSRCP Leaders Attack: కర్నూలులో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. జనసేన నేతపై రాడ్డు​తో దాడి

By

Published : May 21, 2023, 8:27 AM IST

thumbnail

Kurnool YSRCP Leaders Attack: కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన కార్యకర్తపై ఇనుప రాడ్డు​తో దాడి చేసి గాయపర్చారు. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన వివాదం.. ముదిరి చివరకు దాడికి దారి తీసింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని.. ఆదోనిలో విజయ్ అనే జనసేన కార్యకర్త​పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. దీనిపై బాధితుడు, నియోజకవర్గ జనసేన ఇన్​ఛార్జ్ మల్లప్ప.. ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడిన విజయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను పోస్టులు పెట్టకపోయినా తనపై దాడికి దిగారని బాధితుడు వాపోయారు. తాను ఎటువంటి పోస్టులు పెట్టలేదని కావాలంటే చెక్​ చేసుకోమని తన సెల్​ఫోన్​ వారికి ఇచ్చినా.. పట్టించుకోకుండా దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదని.. కేవలం అభివృద్ధిపై మాత్రమే ప్రశ్నించినందుకు దాడి చేశారని అదోని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్​ ఆరోపించారు. ముష్టిఘాతాలు కురిపిస్తూ.. ఇనుప రాడ్డు​తో దాడికి దిగారని ఆయన తెలిపారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.