'వైసీపీ పాలనలో దళితులపై దాడులకు అంతులేదా? ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 10:58 AM IST

thumbnail

Attacks on Dalits under YCP regime : వైసీపీ ప్రభుత్వాన్ని దళితులు భూస్థాపితం చేయడం ఖాయమని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లేవనెత్తారు. గన్నవరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వెంకట్రావు పాల్గొన్నారు. దళితులకు మేనమామ అని చెప్పుకొంటున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డి.. మహిళలపై హింసాత్మక  దాడులు జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వెంకట్రావు అన్నారు. దళిత సోదరుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇంకా శిక్ష పడకపోవడం దళిత సోదరులకు జరుగుతున్న అన్యాయం అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైసీపీలో ఉన్న దళిత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం దళితులను మోసం చేయడమే అని అన్నారు. ఇప్పటికైనా దళిత సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ గమనించాలన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వ అధికారం సాధించి మీకు రక్షణగా అన్ని విధాల పార్టీ తోడుగా ఉంటుందని అన్నారు. దళిత యువకుడు శ్యామ్​ కుమార్​కు న్యాయం జరగాలని ఈ విషయంపై సీఎం జగన్ కచ్చితంగా స్పందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.