YCP Leaders Attacked on Reporter: నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ కార్యకర్తలు.. రిపోర్టర్​పై దాడి..

By

Published : Jul 16, 2023, 1:51 PM IST

thumbnail

YCP Leaders Attacked on Reporter: నంద్యాల జిల్లా మహానందిలో వైఎస్సార్​సీపీ నేతలు వీరారెడ్డి, అతని అనుచరులు రిపోర్టర్​పై దాడికి పాల్పడ్డారు. నేతల అక్రమాలపై వార్తలు రాశారన్న కక్షతో.. జగనన్న సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకులు దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అధికార పార్టీ నేతలను అదుపు చేశారు. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కొద్ది దూరంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. దాడిపై బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఓ రైతు పంటకు అమర్చిన డ్రిప్పును అధికార వైఎస్సార్​సీపీ సానుభూతిపరుడు తొలగించిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధిత రైతు ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రామగిరి మండలం కలికివాండ్ల పల్లికి చెందిన రైతు శ్రీధర్​కు కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 578-3లో 4.87 సెంట్ల డి.పట్టా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన డి.పట్టాను 2007లో అధికారులు తనకు ఇచ్చినట్లు చెప్పాడు. కాగా రెండు రోజుల క్రితం ఆ భూమిలోనే 2ఎకరాల్లో బూడిద గుమ్మడి విత్తనం వేసి డ్రిప్పు అమర్చినట్లు బాధితుడు తెలిపాడు. అయితే అదే గ్రామానికి చెందిన వైఎస్సార్​సీపీ సానుభూతిపరుడు రాత్రి వేళల్లో వచ్చి డ్రిప్పును ధ్వంశం చేసినట్లు ఆరోపించాడు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూమి తనదే అంటూ తనపై దౌర్జన్యం చేస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. వ్యవసాయంపై ఆధారపడి ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్న తనకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని వేడుకున్నాడు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.