Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

By

Published : Jun 3, 2023, 11:12 AM IST

thumbnail

Today Raod Accident in Annamayya: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదర్శనకు తుఫాను వాహనంలో వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఈ ఉదయం చోటుచేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన 12 మంది భక్తులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిత్తూరు-కడప ప్రధాన రహదారిలోని అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణానికి అతి సమీపంలో కల్లూరు మండల సరిహద్దులో ఆగివున్న లారీని తుపాన్​ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నంద్యాలకు చెందిన విమల, శివమ్మ, లక్ష్మీదేవి, ప్రతాపరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. నంద్యాల టౌన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగమణి, రమేష్​, రామ తులసమ్మ, ధనస్సు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.